Thursday, April 25, 2024

వైవిధ్యం కోరుకుంటున్న ప‌ర్యాట‌కులు.. ఓయో ఇండియాస్ క‌ల్చ‌ర‌ల్ ట్రావెల్ నివేదిక వెల్ల‌డి

హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : భారతదేశపు పర్యాటక కేంద్రాల వైవిధ్యతల్లో కోస్తా, పర్వతాలు, నగరాల ఆవలకూ విస్తరించింది. ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటిగా ఆధ్యాత్మికత, పరంపర, సంప్రదాయాలు అన్నింటినీ కలుపుకున్న సంగమంగా భారతదేశం ఉంది. మహమ్మారి పరిస్థితులు నియంత్రణలోకి వచ్చిన తర్వాత స్థానిక పర్యాటక ప్రాంతాలను ఆవిష్కరించేందుకు ఉత్తేజిస్తుండగా, గత రెండేళ్ల నుంచి సాంస్కృతిక పర్యాటకం అత్యంత ముందంజలో ఉంది.

భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు ప్రయాణ అనుభవాలను, అభిప్రాయాలను అధ్యయనం చేసిన గ్లోబల్‌ ట్రావెల్‌ కంపెనీ ఓయో ఇండియాస్‌ టెజర్‌ ట్రూవ్‌ ఆఫ్‌ కల్చరల్‌ ట్రావెల్‌ 2022 నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం గత రెండేళ్లలో 3.5 రెట్లు అభివృద్ధి సాధించగా 2022లో సాంస్కృతిక కేంద్రాల్లో శ్రీనగర్ అత్యంత ఎక్కువ బుకింగ్‌లను సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement