Thursday, March 28, 2024

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. 708 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటిరోజు స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 708పాయింట్లు పెరిగి 59,277 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 206 పాయింట్ల్‌ లాభపడి 17,670 వద్ద ముగిసింది. బ్యాంకు, పవర్‌స్టాక్‌లు మార్కెట్‌కు వెన్నుదన్నుగా నిలిచాయి. దీంతోపాటు అంతర్జాతీయ సానుకూలతలు కూడా తోడయ్యాయి. నిప్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.49శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.68 శాతం పెరిగాయి. నిప్టీn బ్యాంక్‌ 2.13శాతం, నిప్టీ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ 1.87శాతం పెరిగింది. కరెంటు ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ నిప్టీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆ స్టాక్‌ 5.78 శాతం పెరిగి 142.80 వద్ద స్థిరపడింది. పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌ 3.99 శాతం పెరిగింది. బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కూడా లాభపడ్డాయి.

మొత్తం 2,732 కంపెనీల షేర్లు పెరగ్గా 663 కంపెనీల షేర్లు తగ్గాయి. 30షేర్ల ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటాన్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌ నష్టాల్లో స్థిరపడ్డాయి. ఐటీశాఖ దాడుల ఆందోళనల మధ్య హీరో మోటోకార్ప్‌ 2.39 శాతం పడిపోయింది. ఎస్‌ఎంఎల్‌ ఇసుజు షేర్లు 20శాతం వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ షేర్లలో 43శాతంవృద్ధి నమోదు కావడమే అందుకు కారణం. టాటా మోటార్స్‌ దేశీయ విక్రయాల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 2శాతం మేర లాభపడ్డాయి. గుజరాత్‌ ఆల్కలీస్‌ షేర్లు ఈ నెలలో 51శాతానికి పైగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్‌లో ఈ స్టాక్‌ 12శాతం మేర లాభపడింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 105 డాలర్లుగా ఉండగా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 100 డాలర్లుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement