Saturday, April 20, 2024

లాభాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశం. ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడే సమయంలోను సెన్సెక్స్, నిఫ్టీ పైపైకి లేచాయి. ఉదయం నుంచి స్వల్పంగా, పైకి కిందకు కదిలినప్పటికీ, మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియగా.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. కానీ కేంద్రం చర్యలు, ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో సానుకూలంగా కదిలాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement