Tuesday, April 23, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. రోజు ఆరంభ నుంచే మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్‌ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 52,443కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద స్థిరపడింది.

ఇది కూడా చదవండి: రామప్పపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement