Wednesday, March 27, 2024

స్వ‌ల్ప‌ న‌ష్టాల‌తో బ‌య‌ప‌డ్డ‌ స్టాక్ మార్కెట్..

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో నేడు ముగిసాయి. సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో 60105 వద్ద,నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17895 వద్ద స్థిరపడ్డాయి. అంత‌కు అమ్మ‌కాల ఒత్తిడికి లోను కావ‌డంతో ఒక ద‌శ‌లో సెన్సెక్స్ 309 పాయింట్లు న‌ష్ట పోయింది.. చివ‌ర‌కు 10 పాయింట్ల న‌ష్టంతో స్థిర‌ప‌డింది.. నేడు హిందాల్కో, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బీపీసీఎల్‌ లాభపడగా, భారతి ఎయిర్టెల్‌, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌యూఎల్‌ నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement