Wednesday, March 27, 2024

భారీగా పడిపోయిన రూపాయి విలువ

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం రూపాయితో డాలర్ విలువ 75కి పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి అది 76కు పెరిగే ముప్పుందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. మార్చి చివరి నాటికి 0.1 శాతమే పడిపోయిన రూపాయి విలువ.. ఏప్రిల్‌లో ఇప్పటిదాకా 2.6 శాతం పతనమైంది.

అటు పెరుగుతున్న నిత్యావసరాల ధరలూ కరెంట్ ఖాతాల్లో లోటుకు కారణమవుతాయని, దాని వల్ల రూపాయి మరింత బలహీన పడే ప్రమాదముందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాని వల్ల దేశంలో డాలర్ నిల్వలు కరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఆర్థిక వ్యవస్థపై మునుపటి కన్నా మరింత ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని ముంబైలోని ఫెడరల్ బ్యాంక్ ట్రెజరీ అధిపతి వి.లక్ష్మణన్ చెప్పారు. కరోనా ప్రభావాన్ని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని అన్నారు. అయితే, ప్రస్తుతమున్న విదేశీ మారక నిల్వలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడ్డు పరిస్థితులను అధిగమిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement