Friday, March 29, 2024

మెట్రో ఇండియాను కొనుగోలు చేయనున్న రిలయన్స్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జర్మనీకి చెందిన మెట్రో ఏజీ హోల్‌సేల్‌ భారత్‌ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేయనుంది. దీనిపై ఇప్పటికే రిలయన్స్‌ కంపెనీ మెట్రోతో చర్చలు పురోగతిలో ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మెట్రో మన దేశంలో హోల్‌సేల్‌ బిజినెస్‌లో ఉంది. హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో మెట్రో హోల్‌సేల్‌ కేంద్రాలు ఉన్నాయి. దీనిపై తుది నిర్ణ యం త్వరలోనే వస్తుందని తెలిపారు. మెట్రో హోల్‌సేల్‌ బిజినెస్‌ను రిలయన్స్‌ 1 నుంచి 1.2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయవచ్చని ఈ వర్గాలు తెలిపాయి. 2003లో మెట్రో మన దేశంలోకి ప్రవేవించింది. మెట్రో రిటైల్‌ వ్యాపారులతో మాత్రమే బిజినెస్‌ చేస్తుంది. రిలయన్‌ రిటైల్‌ బిజినెస్‌తో పాటు, హోల్‌సేల్‌ బిజినెస్‌ విస్తరణ భాగంగానే ఈ కొనుగోలు జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement