ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు ఇది గుడ్ న్యూస్. బ్రిటిష్ టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ తన వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. వొడాఫోన్కు అనుబంధ సంస్థగా ఉన్న ప్రైమ్ మెటల్స్ ద్వారా.. మరో 3.22 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఇప్పటి వరకు 44.39 శాతం ఉన్న వాటా కాస్తా.. 47.61 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ప్రైమ్ మెటల్స్కు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్లో 7.61 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్కు సమానమైన 218,55,26,081 షేర్లు ఉన్నాయి. కొత్తగా 57,09,58,646 షేర్లను ఫ్రిఫరెన్షియల్ ఇష్యూలో సొంతం చేసుకుంది. రూ.4,500 కోట్ల నిధుల సమీకరణకు గాను ప్రమోటర్ గ్రూప్ కంపెనీలైన యూరో పసిఫిక్ సెక్యూరిటీస్, ప్రైమ్ మెటల్స్, ఒరియానా ఇన్వెస్ట్మెంట్కు 338.3 కోట్ల ఈక్విటీ షేర్ల కేటాయింపును ఆమోదించినట్టు వొడాఫోన్ ఐడియా మార్చిలో ప్రకటించింది. మొత్తం రూ.14,500 కోట్ల నిధులను సమీకరించనున్నట్టు కంపెనీ తెలిపింది. దీంట్లో ప్రమోటర్ గ్రూపుల ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement