Friday, April 19, 2024

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా నెలరోజులుగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. పైగా అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఈ మ‌ధ్యే గ్యాస్ ధ‌ర కూడా రూ.10 మేర త‌గ్గింది. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌రిస్థితి చాలా మెరుగుప‌డింద‌ని, దీంతో రానున్న రోజుల్లో వీటి ధ‌ర‌లు మ‌రింత త‌గ్గుతాయ‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. ఇప్పుడిప్పుడే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గడం మొద‌లైందని,. ఇవి మ‌రింత త‌గ్గుతాయన్నారు. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గితే ఆ ప్ర‌యోజనాన్ని ప్ర‌జ‌ల‌కు బ‌దిలీ చేస్తామ‌ని గ‌తంలోనే చెప్పామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కేంద్ర ప్ర‌భుత్వం వీటిపై ఉన్న ప‌న్నుల‌ను మాత్రం త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ప్ర‌ధాన్ స్ప‌ష్టం చేశారు. కేంద్రానికి కూడా కొన్ని ఆదాయ వ‌న‌రులు ఉండాలి క‌దా అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement