Friday, March 29, 2024

స్థిరంగా చమురు ధరలు.. ఎంతో తెలుసా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా చమురు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఫిబ్రవరి నెల మధ్య వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.16 లకు లభిస్తుండగా.. డీజిల్‌ రూ. 88.20 లుగా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.60 కాగా డీజిల్‌ ధర రూ. 90.10గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 95.52 గా, డీజిల్‌ ధర రూ. 89.06 గా నమోదైంది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 90.56 రూపాయలకు లభిస్తుండగా.. డీజిల్‌ 80.87 రూపాయలకు చేరింది. ముంబైలోనూ చమరు ధరలు స్థిరంగా ఉన్నాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్‌ రూ. 87.96గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement