Saturday, April 20, 2024

మెహుల్ చోక్సికి బెయిల్ మంజూరు

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చోక్సీకి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు డొమినికా కోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన అంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోతూ డొమినికా బీచ్ లో చోక్సీ పట్టుబడ్డాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ఆయనపై డొమినికా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, మే 23 నుంచి ఆయన డొమినికా జైల్లో ఉన్నాడు. తాజాగా బెయిల్ లభించడంతో డొమినికా నుంచి అంటిగ్వా అండ్ బార్బుడాకు వెళ్లనున్నాడు.

2018లో ఇండియా నుంచి పారిపోయిన చోక్సీ అప్పటి నుంచి అంటిగ్వాలోనే ఉన్నాడు. తాను నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని, అంటిగ్వాలోని వైద్యుడిని సంప్రదించడం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును చోక్సీ కోరాడు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డొమినికా కోర్టులో చోక్సీ తరపున ప్రముఖ లాయర్ విజయ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో క్విట్ ఇండియా నాటి పరిస్థితి: బండి

Advertisement

తాజా వార్తలు

Advertisement