Wednesday, March 27, 2024

Follow up | లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన కొద్ది సేపటి తరువాత కోలుకుని, మళ్లి అమ్మకాలతో ఒత్తిడితో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. రోజంతా ఊగిలిసలాడిన మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 126.41 పాయింట్లు లాభంతో 61294.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.10 పాయింట్ల లాభంతో 18232.55 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 409 రూపాయలు పెరిగి 55587 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 1098 రూపాయలు పెరిగి 70669 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.68 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, దివీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, హీరో మోటో కార్ప్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు..

ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, ఆల్ట్రా సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, కోల్‌ ఇండియా, ఐచర్‌ మోటార్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement