Tuesday, April 16, 2024

బేజారయిన మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. ట్రేడింగ్ ఆరంభంలో లాభాలతో మొదలెట్టిన మార్కెట్లు ఆ తరువాత తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఆటో సూచీల అండతో మళ్లీ కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 54,403కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద స్థిరపడింది. ఇక ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ ల లిస్ట్ లో మహీంద్రా అండ్ మహీంద్రా (2.07%), భారతి ఎయిర్ టెల్ (1.61%), టాటా స్టీల్ (1.33%), ఎల్ అండ్ టీ (0.79%), బజాజ్ ఫైనాన్స్ (0.68%), ఎన్టీపీసీ (0.64%). ఇక టాప్ లూజర్స్ లిస్ట్ లో
యాక్సిస్ బ్యాంక్ (-1.83%), టెక్ మహీంద్రా (-1.77%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.36%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.85%).

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ఎన్నికపై మెగా బ్రదర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement