Thursday, April 25, 2024

క్షణాల్లో రుణం.. యూకో బ్యాంక్‌ డిజిటల్‌ ఆఫర్‌

హైదరాబాదు, ఆంధ్రప్రభ: కస్టమర్ల సౌకర్యార్ధం యూకో బ్యాంకు సరికొత్తగా ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ (పీఏపీఎల్‌) అనే స్కీముని అమల్లోకి తెచ్చింది. అర్హులైన కస్టమర్లకు లోన్లు సుకరంగా శాంక్షన్‌ చేసి పంపిణీ చేయడమే దీని ఉద్దేశం. కస్టమర్లు బ్యాంకు బ్రాంచి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కేవలం కొద్ది నిమిషాల్లోనే లోన్‌ ప్రాసెసింగ్‌ చేస్తా రు. మొబైల్‌ ద్వారా లోన్‌ సొమ్ము బదిలీ చేస్తారు. యూకో కస్టమ ర్లు ఎవ రైనా అర్జెంటుగా సొమ్ము అవసర పడితే 24 గంటల్లో ఎప్పుడైనా ఈ స్కీముని సద్వి నియోగం చేసుకోవచ్చు. ఇందుకు పది శాతం వడ్డీ ఉంటుంది.

ప్రీ క్లోజర్‌ చార్జీలుండవు. రుణాల మంజూ రులో 15 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంతోను. అదే సమయంలో కొత్త తరం కస్టమర్లను ఆకర్షించే ఉద్దేశంతోను యూకో బ్యాంకు డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి అడుగుపెట్టినట్టు బ్యాంకు ఒక పత్రికా ప్రకటనలో పే ర్కొంది. తమ ఈ లక్ష్యాన్ని పీఏపీఎల్‌ స్కీముతో మొదలుపెడుతున్నట్టు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement