Thursday, April 25, 2024

లాంచ్ అయిన‌ వెూటో జీ72.. బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్కేట్ లోకి

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే మొదటగా మెటో జీ72ని మోటోరోలా లాంచ్‌ చేసింది. భారతదేశపు మొట్టమొదటి 10బిట్‌ బిలియన్‌ కలర్‌ 120హెచ్‌జెడ్‌ పోల్డ్‌ డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్‌ కెమెరా.. ఇలాంటి అద్భుతమైన ఫీచ‌ర్స్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ కేవలం ఇప్పుడు రూ.14,999లకు మాత్రమే మోటోరోలా అందజేస్తుంది. ఇది స్టాండర్డ్‌ 8బిట్‌ డిస్‌ప్లేల కంటే 64రెట్లు ఎక్కువ. ఇది చాలా స్లిమ్‌గా, వర్చువల్‌గా బోర్డర్‌లెస్‌గా ఉండే అద్భుతమైన ప్రీమియం డిస్‌ ప్లే. మోటో జీ72 అద్భుతమైన చిత్రాల కోసం 108 మెగాపిక్సెల్‌ అల్ట్రా పిక్సెల్‌ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. అత్యంత అధునాతనమైన, చాలా వివరణాత్మక ఫోటోలను తీసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

మోటోరోలా ఇప్పుడు 4జీ అలాగే 5జీ పరికరాలను ధరల పరిధిలో అందించడం కొనసాగించడం ద్వారా తన వినియోగదారుల అవసరాలను తీర్చడం కొనసాగిస్తుంది. మోటో జీ72 అనేది సెగ్మెంట్‌లో అత్యంత సొగసైన, తేలికైన, స్టైలిష్‌ ఫోన్‌, కేవలం 7.99ఎంఎం, కేవలం 166జీఎం, ప్రీమియం యాక్రిలిక్‌ గ్లాస్‌, ముగింపుతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మోటో జీ72 కూడా అద్భుతమైన 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని ఆ సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement