Thursday, April 25, 2024

భారత మార్కెట్‌లోకి జీప్‌ గ్రాండ్‌ చెరోకీ

ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్‌ ఇండియా దేశీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌ చెరోకీని ఆవిష్కరించింది. ప్రీమియం ఎస్‌యూవీ కారులో ఇది లేటెస్ట్‌ జనరేషన్‌. ఎస్‌యూవీ గ్రాండ్‌ చెరోకి ధర రూ.77.50 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు నాలుగు రంగుల ఆప్షన్లు.. బ్రైట్‌ వైట్‌, డైమండ్‌ బ్లాక్‌ క్రిస్టల్‌, మౌంటైన్‌ అండ్‌ వెల్వెట్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ నెలాఖరులో ఎస్‌యూవీ కార్ల డెలివరీ మొదలవుతుంది. రూ.50 వేలు చెల్లించి ఈ కారు బుక్‌ చేసుకోవచ్చు. గత సెప్టెంబర్‌లోనే గ్లోబల్‌ మార్కెట్‌లోకి ఎంటరైందీ ఈ గ్రాండ్‌ చెరోకీ. అమెరికా తర్వాత భారత్‌లో మాత్రమే జీప్‌ ఇండియా తన గ్రాండ్‌ చెరోకీ కారును తయారు చేస్తున్నది.

మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో జీప్‌ ఇండియా ఈ కార్లను ఉత్పత్తి చేస్తోంది. వెహికల్‌ మానిటరింగ్‌, స్మార్ట్‌వాచ్‌ ఎక్స్‌టెన్షన్‌, అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, రిమోట్‌ వెహికల్‌ మేనేజ్‌మెంట్‌, 24 గంటల సర్వైలెన్స్‌ వంటి 33 కనెక్టెడ్‌ ఫీచర్లతో గ్రాండ్‌ చెరోకీ వస్తున్నది. ప్రయాణికుల సేప్టీnకి జీప్‌ ఇండియా ప్రాధాన్యం ఇస్తున్నది. 8-ఎయిర్‌బ్యాగ్స్‌తోపాటు 110ం సేప్టీn ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వస్తున్నది. ్లబండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, యాక్టివ్‌ లేన్‌ మేనేజ్మెంట్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌ వంటి లెవెల్‌ 2 అడాస్‌ ఫీచర్లు జత కలిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement