Tuesday, March 26, 2024

వీవో నుండి వీ25 ఆవిష్కరణ

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : సృజనాత్మక గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో వీ25 5జీని ఆవిష్కరించింది. తద్వారా దేశంలో తన వీ25 సిరీస్‌ లైనప్‌ ని విస్తరించింది. 50 మెగాపిక్సెల్‌ ఐఏఎఫ్‌ సెల్ఫీ కెమెరా, 64 మెగాపిక్సెల్‌ ఓఐఎస్‌ నైట్‌ కెమెరాతో అద్భుతమైన కెమెరా పనితీరును అందించేలా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను రూపొందించారు, ఇది మ్యాజికల్‌ కలర్‌ ఛేంజింగ్‌ ప్లnోరైట్‌ ఏజీ బ్యాక్‌ ప్యానెల్‌ ను కలిగి ఉంది. సరికొత్త వీ25 5జీ ట్రెండ్‌ సెట్టింగ్‌ సెల్ఫీ, కెమెరా ఔత్సాహికుల కోసం, ఫంక్షనల్‌ ఇంకా సొగసైన డిజైన్‌, ప్రీమియం ఫోటోగ్రఫీ ఫీచర్లు, ఉత్తమ ఇన్‌ క్లాస్‌ పనితీరును కోరుకునేవారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ సర్ఫింగ్‌ బ్లూ, ఎలిగెంట్‌ బ్లాక్‌ అనే రెండు సొగసైన రంగుల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వీవో వీ25 5జీ ధర రూ.27,999 (8జీబీ ప్లస్‌ 128జీబీ), రూ.31,999 (12ప్లస్‌ 256 జీబీ)గా ఉంది.

ఇది 2022 సెప్టెంబర్‌ 20 నుండి ప్లిప్‌ కార్ట్‌, వివో ఇండియా ఈ స్టోర్‌, అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ప్లిప్‌ కార్ట్‌, వీవో ఈ స్టోర్‌ లో ఈ పరికరాన్ని ప్రీబుక్‌ చేసుకోవచ్చు. రూ.2,500 (హెచ్‌ డీఎఫ్‌ సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై వర్తిస్తుంది). తక్షణ క్యాష్‌ బ్యాక్‌ తో పాటు రూ.2,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ను పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement