Saturday, April 20, 2024

Follow up: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచే లాభాల్లో ప్రారభమైన సూచీలు రోజంతా అదే బాటులో కొనసాగాయి. చివరి అరగంటలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో వరసగా మూడో రోజూ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గురువారంనాడు సెన్సెక్స్‌ జీవనకాల గరిష్టానికి చేరింది. నిఫ్టి 52 వారాల గరిష్టాన్ని తాకింది. బుధవారం నాడు వెలువడిన అమెరికా ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వివరాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. వడ్డీరేట్లు పెంపు విషయంలో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వెనక్కి తగ్గింది. దీంతో అమెరికా, ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరల్లు భారీగా తగ్గాయి. చమురు బ్యారెల్‌ ధర 85 డాలర్లకు దిగువకు వచ్చింది. ఇది కూడా మార్కెట్ల ర్యాలీకి కారణంగా ఉంది. సెన్సెక్స్‌ 762.10 పాయింట్లు లాభపడి 62272.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 216.85 పాయింట్లు లాభపడి 18484.10 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 244 రూపాయలు పెరిగి 52695 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 464 రూపాయలు పెరిగి 62094 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.69 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

- Advertisement -

ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఐటీసీ, మారుతి సుజుకీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐచర్‌ మోటార్సప్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement