దేశీయ స్టాక్స్ ఇవాళ లాభాల్లో ముగిసాయి. ఉదయం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు లాభాలతో ముగిసాయి. రుణాల చెల్లింపులపై ఆర్బీఐ విధించిన ఆరు నెలల మారటోరియం సమయాన్ని పెంచమని తాము ఆదేశించలేమని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో, బ్యాంకింగ్ షేర్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు లాభపడి 50,051కి చేరుకుంది. నిఫ్టీ 78 పాయింట్లు పుంజుకుని 14,815 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement