Thursday, April 25, 2024

భారత్‌లో హోండా యాక్టివా.. 125 ప్రీమియం లాంచ్‌

న్యూఢిల్లి: భారత్‌లో హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్‌ లాంచ్‌ అయింది. డ్రమ్‌ బ్రేక్‌ వేరియంట్‌ రూ.78,725రూపాయలుకాగా, డిస్క్‌ బ్రేక్‌తో యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్‌ రూ.82,280కు లభిస్తుంది. స్టాండర్డ్‌ యాక్టివా 125తో పోలిస్తే ప్రీమియం ఎడిషన్‌ దాదాపు రూ.1955 అధికం. ప్రీమియం ఎడిషన్‌ పెరల్‌ అమేజింగ్‌ వైట్‌, స్టీల్‌ బ్లాక్‌ మెటాలిక్‌ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది.

ప్రీమియం ఎడిషనన్‌ బ్లాక్డ్‌ అవుట్‌ ఇంజిన్‌, సస్పెన్షన్‌ ఫోర్క్స్‌, బాడీ కలర్డ్‌ గ్రాబ్‌ రెయిల్‌, ప్రీమియం గ్రాఫిక్స్‌ తదితర ఫీచర్లతో వినియోగదార్లను ఆకట్టుకుంటుందని హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యదిందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు. భారత్‌లో దిచక్ర వాహనదారుల అవసరాలకు అనుగుణంగా యాక్టివా 125ప్రీమియం స్టైలిష్‌ డిజైన్‌, కలర్ స్కీమ్‌లతో లాంచ్‌ చేశామని గులేరియా పేర్కొన్నారు. యాక్టివా 125 సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌, స్పీడ్‌, డిజిటల్‌ డిస్‌ప్లే, ట్రిప్‌ మీటర్‌ కోసం అనలాగ్‌ కౌంటర్‌, ఏసీజీ సైలెంట్‌ స్టార్ట్‌ సిస్టమ్‌, స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్‌ వంటి ఉన్నాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement