Thursday, April 25, 2024

విమానాలపై నిషేధం ఎత్తివేత..

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో మన దేశం నుంచే వచ్చే విమనాలను పలు దేశాలు నిషేధించాయి. కాగా ఈ నిషేధాన్ని భారత్ నుంచి వచ్చే విమానాలపై రేపటి నుంచి నిషేధం ఎత్తేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెంకడ్ వేవ్ అప్పటి నుంచి ఐదు నెలలపాటు ఈ బ్యాన్ కొనసాగింది. ఇప్పుడు తాజాగా దీన్ని తొలగిస్తున్నట్లు కెనడా తెలిపింది. అయితే భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అనుమతి పొందిన ల్యాబొరేటరీల నుంచి కరోనా నెగిటివ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని కెనడా సూచించింది. ఈ పరీక్షలను ప్రయాణానికి 18 గంటల ముందు చేయించుకోవాలని చెప్పింది. కాగా, భారత్ నుంచి మూడు విమానాల్లో కెనడా చేరిన ప్రయాణికులు అందరూ కరోనా నెగిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement