Tuesday, March 26, 2024

సంచలనాత్మక సాంకేతికతతో ఎల్జి నుంచి 2022 ఓఎల్‌ఈడీ టీవీలు

హైదరాబాద్‌ (ప్రభ న్యూస్‌) : భారతదేశ అగ్రగామి కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్‌ అయిన ఎల్జి తాజా 106 సెం.మీ. (42) నుంచి 246 సెం.మీ. (97) దాకా విస్తృత శ్రేణిలో 2022 ఓఎల్‌ఈడీ టీవీలను ప్రవేశపెట్టింది. కస్టమైజబుల్‌ వీక్షణ అనుభూతిని ఇవి అందిస్తాయన ఆ సంస్థ తెలిపింది. మార్కెట్లోకి వచ్చిన మొదటి రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీవీ ఎల్జి సిగ్నేచర్‌ ఆర్‌ ఓఎల్‌ఈడీ కావడం విశేషం. ప్రపంచపు మొదటి 106 సెం.మీ. ఓఎల్‌ఈడీ టీవీ అనేది చిన్న గదులకు చక్కగా సరిపోతుందని తెలిపింది. ఎల్జి 2022 ఓఎల్‌ఈడీ టీవీలు వెబ్‌ ఓఎస్‌ 22తో వస్తాయని, ఇది ఎల్జి వినూత్న స్మార్ట్‌ టీవీ ప్లాట్‌ ఫామ్‌ నూతన వెర్షన్‌ అని తెలిపింది. ఓఎల్‌ఈడీ ధర రూ.89,990ల నుంచి ప్రారంభమవుతుందని ఆసంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement