Saturday, April 20, 2024

వివేకా హ‌త్య‌కేసులో పురోగ‌తి శూన్యం… విచార‌ణాధికారిని మార్చాల‌ని సుప్రీం ఆదేశం

వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈకేసులో విచారణాధికారిని మార్చాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేట‌స్ రిపోర్టులో ఎక్క‌డ చూసినా రాజ‌కీయ వైరం అని మాత్ర‌మే రాశార‌ని, ఎలాంటి పురోగ‌తి లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. త‌దుప‌రి విచార‌ణ ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement