Wednesday, April 24, 2024

వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఒత్తిడి పెంచడం, కృష్ణా జలాల వివాదం.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement