Friday, April 26, 2024

Flash: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై గ్రామస్తుల దాడి

ఏలూరు జిల్లా జీ కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అతికష్టం మీద పోలీసుల సహకారంతో ఆయన బయటపడ్డారు. జీ కొత్తపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్‌ శనివారం ఉదయం హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రాప్‌ ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో ఆయన గాయపడ్డారు. తోపులాటలో ఎమ్మెల్యే ధరించిన చొక్క చినిగిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement