Tuesday, April 16, 2024

కుప్పం దెబ్బకు పిచ్చెక్కింది: చంద్రబాబుపై రోజా ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాయలసీమ జిల్లాల్లో వరదలు సంభవించాయన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కుప్పం దెబ్బకు చంద్రబాబుకు పిచ్చెక్కిందని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏరియల్‌ సర్వే చేయలేదా అని ప్రశ్నించారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లిన చంద్రబాబు వారికి ఏం చేశారని నిలదీశారు. వరద బాధితుల వద్దకు వెళ్లిన చంద్రబాబు.. తన బాధలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement