Saturday, April 20, 2024

మంత్రి కన్నబాబును అడ్డుకున్న వైసీపీ నేతలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి కన్నబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రాయుడుపాలెంలో సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని అడ్డుకుని ఆందోళనకు దిగారు. కాపులకే మంత్రి పెద్దపీట వేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. దేవదాయ శాఖ స్థలం విషయంలో న్యాయం చేయట్లేదని వైసీపీ బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు కృషిచేసిన బీసీలను పట్టించుకోవట్లేదని తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి కన్నబాబు.. గుడి స్థలం దేవదాయ శాఖ పరిధిలో ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి: నైరుతి తిరోగమనం: ఏపీలో రెండు రోజులు వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement