Tuesday, March 26, 2024

Breaking: ప్రకాశం జిల్లాలో వైఎస్ విగ్రహం ధ్వంసం

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బల్లికురవ మండలం కొప్పెరపాలెంలో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌ విగ్రహానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వైఎస్సార్‌ విగ్రహం దెబ్బతినడమే కాకుండా మసిబారింది.

వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది టీడీపీ నేతలు చేసిన పనే అని వైఎస్సార్‌ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా, ఇటీవల గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓ వైసీపీ నేత ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement