Wednesday, April 17, 2024

వివేకా మర్డర్ కేస్: ఆ రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరిగారు?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ తుది దశకు చేరుకుంటుంది. గత మూడు నెలలుగా సిబిఐ అధికారులు ఈ కేసులో అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్ప‌టికే కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో అధికారులు పలువురిని విచారించారు. ఈ కేసులో సీబీఐ అధికారులు కీల‌క వివ‌రాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.  

వివేక హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులలోని వివేక నివాసంలో రెండవ రోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ జ‌రుగుతోంది. వివేక హత్య జరిగిన స‌మ‌యంలో ఆయ‌న‌ నివాసంలోకి ఎవరెవరు వెళ్లారనే విష‌యంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఆ రోజు రాత్రి ఎవరెవరు ఇంట్లో  తిరిగారు? అనే దానిపై వివరాలు సేకరిస్తోంది. కాగా ఈ కేసులో నిందితుడు సునీల్ ప్రస్తుతం సి.బి.ఐ అదుపులోనే ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement