Friday, March 29, 2024

CBI | వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మ‌ర్డ‌ర్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇవ్వాల (సోమ‌వారం) కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి రేపు (జనవరి 24) హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందులలో అవినాష్ రెడ్డి పీఏకు నోటీసులు అందజేశారు.

కాగా, సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. తాను సీబీఐ విచారణకు అన్నివిధాలా సహకరిస్తానని వెల్లడించారు. అయితే, పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున ఇప్పుడే విచారణకు రాలేనని తెలియజేశారు. విచారణకు మరో తేదీ తెలియజేయాలని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇక‌.. పులివెందులలో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీయడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement