Thursday, April 25, 2024

వివేకా హత్య కేసు: సిబిఐ అధికారులతో వైయస్ సునీత భేటీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి నిన్న భేటీ అయ్యారు. సీబీఐ అధికారులతో దాదాపు గంటపాటు సమావేశమై కేసు పురోగతిపై చర్చించారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు, యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్‌రెడ్డి నిన్న సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయ్‌ను సీబీఐ గతంలోనూ పలుమార్లు విచారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement