Tuesday, April 23, 2024

Yellow Fever – రేపే టిడిపి మ‌హానాడు – ప‌సుపు శోభితంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం …

అమరావతి,ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడుకు గోదావరి తీరం ముస్తాబవుతోంది. రెండ్రోజుల పాటు- రాజమహేంద్రవరంలో నిర్వ హించనున్న మహానాడుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ సమావేశా లు, సభలకు అవసరమైన ప్రాంగణాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.తొలిరోజు 27న ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరు కానున్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ మహానాడు లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచనున్న అనేక కీలక అంశాలతో పాటు ప్రాథమిక అంశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో నిర్వహించే మహానాడు ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు- చేస్తున్నారు. ఎన్టీఆర్‌ శత జ యంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించబో తున్నారు.ఈ నెల 28న ఎన్టీఆర్‌ కు నివాళులర్పించిన అనంతరం దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించను న్నారు.

పార్టీ నేతలు, శ్రేణులకు ఎన్నికల కార్యా చరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మహానాడులో మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలను వెల్లడిం చనున్నట్లు- సమాచారం.
వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటు-న్న సమస్యలు, రాష్ట్రం వివిధ రంగాల్లో నష్టపోయిన పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. మొత్తం 15 తీర్మా నాలను టీడీపీ ప్రవేశపెట్టనుంది. తెలంగాణకు సంబంధించి.. ప్రభు త్వ వైఫల్యం, ప్రశ్నాపత్రా ల లీక్‌, మహిళలపై అఘాయిత్యాలు, పూర్తి కాని సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానాలు రూపొందించారు. మొత్తంగా మహానాడులో ఏపీకి సంబం ధించిన 15, తెలంగాణకు సంబంధించి 6, 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశ పెట్టను న్నారు. రాజకీయ తీర్మానంలో పొత్తులపై ప్రస్తావన తీసుకురానున్నట్లు- తెలుస్తోంది. పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దాదాపు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడును ఏర్పాట్లు: అచ్చెన్నాయుడు
కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడును ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్య క్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ వేడుకను నిర్వ హించేలా ఏర్పాట్లు- జరుగుతున్నాయని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నుంచి క్లస్టర్‌ ఇన్‌ చార్జ్‌ ల వరకు దాదాపు 15వేల మంది ప్రతినిధులతో తొలిరోజు సభ నిర్వహి స్తామని, అయితే దీనికి లక్ష మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతుందని మహానాడులో ప్రవేశపెట్టనున్న తీర్మానాలకు పొలిట్‌ బ్యూరో ఆమోదం తెలుపనుందని వెల్లడించారు. మొత్తం 15 తీర్మానాలు ప్రవేశపెట్ట డంతో పాటు పలు కీలక ప్రకటనలు పార్టీ అధిష్టానం మహానాడు వేదికగా చేయనుం ద ని తెలిపారు. ముఖ్యంగా వైకాపా పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి దశ, దిశ నిర్దేశించే విధంగా పలు తీర్మా నాలను మహానాడులో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మహానాడుకు రావాలంటూ చంద్రబాబు ఆహ్వానాలు

తెలుగుదేశం పార్టీ జండా పండుగ మహానాడుకు హాజరయ్యేందుకు తెలుగు తమ్ముళ్లకు ఆహ్వానాలు అందాయి.ఈ నెల 27న ప్రతి నిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీ-డీపీ అధినేత చంద్రబాబునాయుడు డిజిటల్‌ సంతకంతో పార్టీ యంత్రాంగం ఆహ్వానాలు పంపుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్‌ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సంద ర్భంగా కొనియాడారు.ఈ ఆహ్వాన పత్రిక లో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement