Tuesday, April 23, 2024

AP: వైసీపీ ఎమ్మెల్సీ భ‌గీర‌థ్‌రెడ్డి ఇక‌లేరు.. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ క‌న్నుమూత‌

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి చ‌నిపోయారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌ హైదరాబాదులోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్లో ఇవ్వాల (బుధ‌వారం) తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్ పై అందించిన చికిత్స ఫలించలేదు. చల్లా భగీరథ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 46 ఏళ్ల వయసుకే ఆయన ఈ లోకాన్ని వీడ‌డంపై వైసీపీ వర్గాల్లో విషాదం నెల‌కొంది. కాగా, భగీరథ రెడ్డి అంత్యక్రియలు రేపు (గురువారం) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఇక‌.. వైసీపీ ఎమ్మెల్సై చల్లా భగీరథ రెడ్డి దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి చ‌నిపోవ‌డంతో ఆయన కుమారుడు భగీరథ రెడ్డికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. భగీరథరెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైసీపీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement