Thursday, April 25, 2024

వివేకా హత్య కేసుః సీబీఐ విచారణకు హాజరైన జగన్ మేనమామ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 90వ రోజుకు చేరింది. శనివారం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయన ఈ కేసులో విచారణకు రావడం ఇదే తొలిసారి.
కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ రవీంద్రనాథ్ రెడ్డిని విచారించింది. అనేక అంశాలపై ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. ఇటీవల వివేకా హత్యకేసులో సీబీఐ అనేకమందిని విచారిస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొందరిని పలుమార్లు విచారణకు పిలుస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది. ఈ క్రమంలో  సీఎం జగన్‌కు మేనమామ అయిన రవీంద్రనాథ్‌రెడ్డి. మొదటిసారి సీబీఐ విచారణకు వచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement