Tuesday, March 26, 2024

సీఎం జగన్ లక్ష్యం అదే: ఎమ్మెల్యే ఆర్కే

పేద వాడు గొప్ప వాడు కావాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లక్ష్యమని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన పాదయాత్ర శనివారంతో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరి ఆటో నగర్ లోని కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ఆర్ కు ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సంరద్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ నేను విన్నాను నేను వున్నాను అంటూ జగన్మోహనరెడ్డి ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక అన్ని హామీలనూ అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement