Monday, March 25, 2024

సీఎంను తిడితే ఊరుకుంటామా.. రా చూసుకుందాం: లోకేశ్ కు అనిల్ కుమార్ సవాల్

AP POLITICS: నిన్న ప్రెస్ మీట్ లో ‘బోసడీకే’ అంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో రణరంగం సృష్టించాయి. ఆ తర్వాత పట్టాభి ఇంటితో పాటు రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మరోవైపు టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

‘సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిట్టిస్తే చూస్తూ ఊరుకుంటామా.. దమ్ముంటే చూసుకుందాం రా’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేత నారా లోకేశ్ కు బుధవారం సవాల్ విసిరారు. తాము చేతికి గాజులు తొడుక్కోలేదని మండిప‌డ్డారు. ‘‘మీరు చిత్తూరు జిల్లాలోనే పుట్టుంటే.. రా చూసుకుందాం’’ అని చాలెంజ్ విసిరారు. తాను వారం రోజులు నెల్లూరులోనే ఉంటానని ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. ఎవరొచ్చినా సరేనని… కాన్వాయ్ ని కూడా పక్కన పెట్టి వస్తానని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి జగన్ ను దారుణంగా తిట్టిన విషయం జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలియదా? అని అనిల్‌కుమార్ యాద‌వ్ ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే మీరు ఉండగలరా? అని అడిగారు. వైసీపీ కార్యకర్తలను ఎవరు తాకినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement