Thursday, April 25, 2024

తాటాకు చప్పుళ్లకు భయపడే వారు లేరు : చంద్రబాబు

తాటాకు చప్పుళ్లకు భయపడే వారు లేరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ… ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టనన్నారు. ప్రజా సమస్యలపైనే మన పోరాటమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు. రాష్ట్రం అప్పులమయమైందన్నారు. అప్పుల భారం రూ.8లక్షల కోట్లకు పెరిగిందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement