Saturday, April 20, 2024

యువ మహిళా ఎస్సై ఆత్మహత్య

విజయనగరంలో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య కలకలం రేపుతోంది. సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరంలో ఆత్మహత్య చేసుకున్నారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీ అవివాహితురాలు.. అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లి వచ్చారామె… కానీ, ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. కాగా, రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భవానీకి మొదటి పోస్టింగ్ వచ్చింది.. అక్కడే ఆమె ప్రాణాలు తీసుకున్నారు.. ఎస్సై ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామం. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారి ఫోన్‌ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిసింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: తప్పు చేశాను.. తీన్మార్ మల్లన్న సంచలన ట్వీట్

Advertisement

తాజా వార్తలు

Advertisement