Wednesday, April 24, 2024

సీఐపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు

గుంటూరు జిల్లా అరండల్ పేట సీఐ నరేష్‌పై ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్త వేధిస్తున్నాడని స్టేషన్‌కు వెళ్తే సీఐ అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించింది. ఫిర్యాదు పేపర్ విసిరి పడేసి సీఐ అసహ్యించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోమని పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంది. సీఐ నరేష్‌ నుంచి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీకి మహిళ వినతిపత్రం అందించింది. పోలీసులు న్యాయం చేయకపోతే ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement