Friday, March 29, 2024

Flash: ప్రేమ పేరుతో ఎస్సై నయవంచన.. యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో యువతిని ఎస్సై మోసం చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాల్లో చోటుచేసుకుంది. పామిడి మండలం జీఏ కొట్టాలకు చెందిన సరస్వతి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రగిరి ఎస్సై విజయకుమార్ నాయక్ మోసం చేశాడని చనిపోయేముందు బాధిత యువతి ఆరోపించింది. చంద్రగిరి ఎస్సై గా పనిచేస్తున్న విజయకుమార్ నాయక్‌ స్వగ్రామం కూడా జీఏ కొట్టాల. ఎస్సైపై కేసు నమోదు చేసిన పామిడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విజయ కుమార్‌ నాయక్‌ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో డిగ్రీ చదువుతున్న అదే గ్రామానికి చెందిన సరస్వతి, మరో యువతితో ఏకకాలంలో ప్రేమాయణం నడిపాడు. ఇది  యువతులిద్దరికీ తెలియడంతో ఎస్‌ఐ వ్యవహారం బెడిసికొట్టింది. న్యాయం కోసం మరో యువతి దిశ పోలీసులను ఆశ్రయించిందని, దీంతో ఆమెను విజయ్‌ కుమార్‌ పెళ్లి చేసుకున్న విషయం సరస్వతికి తెలియడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు చావుకు కారణమైన ఎస్‌ఐపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పామిడి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్‌ కుమార్‌ నాయక్‌ చంద్రగిరి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement