Thursday, March 28, 2024

హైకోర్టులో ఉద్యోగాల పేరుతో మహిళా మోసాలు..

విజయవాడలో రమాదేవి అనే మహిళా మోసాలు బహిర్గతమయ్యాయి. హైకోర్టులో ఉద్యోగాల పేరుతో రమాదేవి అనే మహిళ మోసాలకు పాల్పడుతోంది. రమాదేవితో పాటు ఆమే కొడుకు, కూతురు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరి మోసాలు బయటకు రావడంతో పోలీసులు వీరందరిపై సస్పెక్ట్ షీట్ తెరిచారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ పేరుతో పలువురి నుండి 71.90 లక్షలు కాజేసి పరారయ్యారు. పెనమలూరు, సత్యనారాయణపురం, మైలవరం పీఎస్ లలో రమాదేవిపై కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న రమాదేవి, ఆమె కుటుంబం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పెనమలూరు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement