Thursday, March 28, 2024

పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని మహిళ మృతి.. హైవేపై రాస్తారోకో..

విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు మండలలో ఈ ఘ‌ట‌న జరిగింది. జుజ్జువ‌రం పరిధిలో వాహనం ఢీకొని మహిళ చ‌నిపోయిన‌ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుండి మచిలీపట్నం వైపు వెళుతున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం , సెంటర్ నుండి రోడ్డు దాటుతున్న వీరంకి బేబీ సరోజిని (57) అనే మహిళను వేగంగా ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆమె కుటుంబ సభ్యులు స్థానికులు ఈ ఘటనపై రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు కిలోమీటర్ల నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ వెంకటనారాయణ ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement