Thursday, April 25, 2024

బద్వేల్ ఉపఎన్నిక: బరిలో 15 మంది అభ్యర్థులు

కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. బుధవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్నాయి. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు ముగిసేలోపు మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో పరిశీలనలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో మొత్తంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఈ నెల 25న టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

Advertisement

తాజా వార్తలు

Advertisement