Wednesday, April 24, 2024

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ సుధీర్‌కుమార్‌

కర్నూలు, (ప్రభ న్యూస్‌): పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ సిహెచ్‌ సుదీర్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నిన్న‌ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్‌లో మ్యాన్‌కైండ్‌ ఫార్మసీ సంస్థ వారు మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ సిహెచ్‌ సుదీర్‌కుమార్‌రెడ్డి సమక్షంలో చెక్కులను అందజేశారు. ఎస్‌ఎం భాషా వెలుగోడు పిఎస్‌లో విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందారు. రూ 3లక్షల చెక్కును ఆయన కుటుంబానికి అందజేశారు. రామాంజనేయులు ఆదోని ఒన్‌టౌన్‌ పిఎస్‌లో విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందారు. రూ 3లక్షల చెక్కును ఆయన కుటుంబానికి అందజేశారు. క్రిష్ణయ్య మద్దికెర పిఎస్‌లో విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందారు. రూ 3లక్షల చెక్కును ఆయన కుటుంబానికి అందజేశారు. మ్యాన్‌ కైండ్‌ ఫార్మా సంస్థ వారికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా బారిన పడి మృతి చెందిన పోలీసు కుటుంబాలకు తాము అండగా ఉంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈకార్యక్రమంలో మ్యాన్‌ కైండ్‌ ఫార్మా లిమిటెడ్‌ కర్నూలు ఇంఛార్జీ నవీన్‌, డిపిఓ ఎఓ సురేష్‌బాబు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement