Thursday, April 25, 2024

Crime: భర్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీరాంనగర్ లో భర్తను పెట్రోల్ పోసి భార్య హత్య చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తన భర్త చిరంజీవిని భార్య అంకాలమ్మ పెట్రోల్ పోసి తగలబెట్టి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఈ ఘటనకు ముఖ్య కారణం కుటుంబ కలహాలే అని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుటుంబ కలహాలే కారణమా ? లేక మరేదైనానా? అనే కోణంలో విచారణ చేపట్టారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement