Monday, March 25, 2024

ఆచంట మండలంలో టీడీపీ, జనసేన మధ్య ఒప్పందం

ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇటీవ‌ల వెల్లడయ్యాయి. అయితే ఎంపీపీ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు ఆయా పార్టీలు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. టీడీపీకి ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన అంగీక‌రించగా, జనసేనకు ఉప‌ ఎంపీపీ పదవి ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకుంది.

ఆచంటలో ఇటీవ‌ల వెల్ల‌డైన ఫ‌లితాల్లో టీడీపీకి చెందిన‌ ఏడుగురు గెలుపొందారు. అలాగే, వైసీపీకి చెందిన‌ ఆరుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెల‌కొంది. చివ‌ర‌కు టీడీపీ, జనసేన ఒప్పందం కుదుర్చుకుని ఎంపీపీ, ఉప ఎంపీపీ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement