Tuesday, March 26, 2024

భీమడోలు పీఎస్‌లో నిందితుడు అనుమానాస్పద మృతి

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు స్టేష‌న్ లోనే అనుమానాస్ప‌దంగా మృతిచెందిన ఘ‌ట‌న ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భీమడోలు పీఎస్‌లో ఓ నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గొలుసు చోరీ కేసులో మూడ్రోజుల క్రితం అప్పారావును పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుడు ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్​లోని బాత్​రూమ్​లో అనుమానాస్పదంగా మరణించినట్లు వారు తెలిపారు. నిందితుడి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement