Friday, March 29, 2024

వైసిపి ప్ర‌భుత్వం త‌ప్పుడు కేసుల‌తో వేధిస్తున్న‌ది – రాష్ట్ర‌ప‌తికి ఎంపి ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు మొర‌

న్యూఢిల్లీ/న‌ర్సాపురం – ఎపిలోని వైసిపి ప్ర‌భుత్వం త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదంటూ ఆ పార్టీకి చెందిన న‌ర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మొర పెట్టుకున్నారు.. న్యూఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో నేడు రాష్ట్ర‌ప‌తిని క‌లిశారు.. ఆయ‌న‌తో 10 నిమిషాలు పాటు మాట్లాడారు.. త‌న‌పై వైసిపి ప్ర‌భుత్వం పెడుతున్న కేసుల వివ‌రాల‌తో ఒక లేఖ‌ను రాష్ట్ర‌ప‌తికి అందించారు.. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తనకు సమయాన్ని కేటాయించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు. కక్షసాధింపుల్లో భాగంగా తనపై ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టించిందనే విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ కేసుల నుంచి తనను రక్షించాలని కోరానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement