Friday, March 29, 2024

ప‌వ‌న్ పై సిపిఐ నారాయ‌ణ మండిపాటు…

భీమ‌వ‌రం – సిపిఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై మండిప‌డ్డారు… బిజెపికి ఏ ముఖం పెట్టుకుని మ‌ద్ద‌తు ఇస్తున్నారంటూ ప‌వ‌న్ ను నిలదీశారు..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భీమవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పాచిపోయిన లడ్డూల కేంద్రం తిరుపతిలో కూర్చుని బీజేపీని సపోర్టు చేస్తున్నారని, అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా, కమ్మగా ఉన్నాయా? అంటూ నిలదీశారు. అలాగే చంద్ర‌బాబు ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు…ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొవాల‌ని, పారిపోతే ఎలా అంటూ చంద్ర‌బాబుని నిల‌దీశారు.. బతికుండి ఓటు వేయకపోతే చచ్చినట్లే లెక్కని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 90 శాతం ఫలితాలు వైసీపీకి అనుకూలమని ఆ పార్టీ నేతలు అంటున్నారని, మరి నామినేషన్లు వేయకుండా ఆపవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అధికారులు, పోలీసులు, రౌడీలను ఉపయోగించి ఎన్నికలను ఏకపక్షం చేసుకోవలసిన అవసరం ఎందుకొచ్చిందని వైసిపిని నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement