Thursday, April 25, 2024

స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం వద్ద స్కూల్ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న సెంట్ జోసెఫ్ స్కూల్ బస్‌ను మరో స్కూల్ బస్ వెనుక నుంచి వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బస్ డ్రైవర్‌పై ఆగ్రహంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement